జేఎన్.1తో ఆందోళన వద్దు : ఎస్పీ సింగ్ బఘేల్
ABN , Publish Date - Dec 29 , 2023 | 06:33 AM
కరోనా కొత్త సబ్ వేరియంట్ జేఎన్.1 గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు. గురువారం ఉదయం ఆయన
తిరుమల, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కరోనా కొత్త సబ్ వేరియంట్ జేఎన్.1 గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు. గురువారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జేఎన్.1 వేరియంట్ అంత శక్తివంతమైనదేమీకాదని, అయినా కేంద్రం అప్రమత్తంగా ఉందని చెప్పారు. రాష్ట్రాలు ఎక్కువ కొవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు.