జీఆర్ఈ ఇకపై రెండు గంటలే
ABN , First Publish Date - 2023-06-02T03:40:36+05:30 IST
విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించాలని అనుకుంటున్నవారికి ఓ శుభవార్త. దాదాపు నాలుగు గంటల పాటు జరిగే జీఆర్ఈ(గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్) పరీక్ష ఇకపై రెండు గంటల్లోపే ముగియనుంది.
సమయం తగ్గింపు.. పది రోజుల్లో ఫలితం
సిలబస్లోనూ పలు మార్పులు
న్యూఢిల్లీ, జూన్ 1 : విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించాలని అనుకుంటున్నవారికి ఓ శుభవార్త. దాదాపు నాలుగు గంటల పాటు జరిగే జీఆర్ఈ(గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్) పరీక్ష ఇకపై రెండు గంటల్లోపే ముగియనుంది. అంతేకాక పరీక్ష ఫలితం కూడా 10 రోజుల్లోపే వెలువడనుంది. జీఆర్ఈను నిర్వహించే ఈటీఎ్స(ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్) ఈ మేరకు పరీక్షలో పలు మార్పులు చేసి ఆ వివరాలను గురువారం ప్రకటించింది. ఇన్నాళ్లూ జీఆర్ఈ పరీక్ష మూడు గంటల 45 నిమిషాల పాటు జరిగేది. ఫలితాన్ని 15 రోజుల్లోపు ప్రకటించేవారు. కానీ, తాజాగా చేసిన మార్పులతో పరీక్ష సమయం ఒక గంట 58 నిమిషాలకు తగ్గింది. ఫలితాన్ని కూడా పది రోజుల్లోపే ప్రకటిస్తారు. వచ్చే సెప్టెంబరులో జరిగే పరీక్ష నుంచి ఈ విధానం అమలు కానుంది. అంతేకాక, పరీక్ష సిలబ్సలో కూడా ఈటీఎస్ పలు మార్పులు చేసింది. సెప్టెంబరు 22 నుంచి జరిగే జీఆర్ఈ పరీక్షలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.