37 ఏళ్లనాటి అవినీతి కేసులో నవాజ్‌కు విముక్తి

ABN , First Publish Date - 2023-06-26T01:07:19+05:30 IST

లాహోర్‌, జూన్‌ 25: అవినీతి కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీ్‌ఫను నిర్దోషిగా ప్రకటిస్తూ లాహోర్‌లోని అకౌంటబిలిటీ కోర్టు తీర్పు చెప్పింది....

37 ఏళ్లనాటి అవినీతి కేసులో నవాజ్‌కు విముక్తి

లాహోర్‌, జూన్‌ 25: అవినీతి కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీ్‌ఫను నిర్దోషిగా ప్రకటిస్తూ లాహోర్‌లోని అకౌంటబిలిటీ కోర్టు తీర్పు చెప్పింది. 37 ఏళ్ల కిత్రం ఆయన పంజాబ్‌ సీఎంగా ఉన్నప్పుడు 6.75 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని జియో మీడియా సంస్థ యజమాని మీర్‌ షకీర్‌ ఉల్‌ రహ్మన్‌కు లంచంగా ఇచ్చారంటూ నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో కేసు పెట్టింది. దురుద్దేశాలతోనే ఆ బ్యూరో కేసు పెట్టిందని షరీఫ్‌ తరఫు న్యాయవాది వాదించారు. ఈ నేపథ్యంలో నవాజ్‌ షరీ్‌ఫను నిర్దోషిగా ప్రకటిస్తూ శనివారం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో, నవాజ్‌ షరీఫ్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఏర్పడింది. పనామా పేపర్ల కేసులో నవాజ్‌ షరీ్‌ఫపై 2018లో అనర్హత వేటు పడింది. ప్రస్తుతం ఆయన లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్నారు.

Updated Date - 2023-06-26T01:07:19+05:30 IST