చిన్న నగరాల ప్రగతితోనే దేశాభివృద్ధి : మోదీ
ABN , Publish Date - Dec 17 , 2023 | 05:35 AM
భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న తన లక్ష్యం నెరవేరాలంటే చిన్న నగరాలు, పట్టణాలను ప్రగతి పథంలోకి తీసుకురావడం అత్యంత కీలకమని
న్యూఢిల్లీ, డిసెంబరు 16: భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న తన లక్ష్యం నెరవేరాలంటే చిన్న నగరాలు, పట్టణాలను ప్రగతి పథంలోకి తీసుకురావడం అత్యంత కీలకమని ప్రధాని మోదీ అన్నారు. చిన్న నగరాల అభివృద్ధి దేశాభివృద్ధికి బలమైన పునాది అని చెప్పారు. వేరు వాళ్లు ఇచ్చిన హామీలపై నమ్మకంపోయిన తర్వాతే మోదీ గ్యారంటీ అర్థం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మోదీ శనివారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా నవంబరు 15నే ప్రారంభమైన ఈ యాత్ర ఎన్నికల వల్ల తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీ్సగఢ్, మిజోరంలో మొదలవ్వలేదు. ఎన్నికలు ముగియడంతో వికసిత్ యాత్ర ప్రచార రథాలను ప్రధాని ప్రారంభించారు.