అండమాన్-నికోబార్ దీవులకు ‘పరమ్ వీర్’ల పేర్లు
ABN , First Publish Date - 2023-01-24T02:42:57+05:30 IST
నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారకార్థం అండమాన్-నికోబార్ దీవుల్లో నిర్మించేందుకు ప్రతిపాదించిన మెమోరియల్ నమూనాను ప్రధాని మోదీ సోమవారం వర్చువల్గా ఆవిష్కరించారు
పోర్ట్ బ్లెయిర్, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారకార్థం అండమాన్-నికోబార్ దీవుల్లో నిర్మించేందుకు ప్రతిపాదించిన మెమోరియల్ నమూనాను ప్రధాని మోదీ సోమవారం వర్చువల్గా ఆవిష్కరించారు. నేతాజీ 126వ సందర్భంగా ప్రధాని ఆయనకు నివాళులర్పించారు. ‘పరాక్రమ్ దివస్’ సందర్భంగా అండమాన్- నికోబార్లోని 21 దీవులకు ‘పరమ్ వీర్ చక్ర’ అవార్డు గ్రహీతల పేర్లను పెట్టారు. వలస పాలనకు వ్యతిరేకంగా నేతాజీ పోరాటం చిరస్మరణీయంగా నిలిచిపోతోందని మోదీ అన్నారు. 1943లో అండమాన్ గడ్డ మీదే మొట్టమొదటి సారి నేతాజీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారని గుర్తు చేశారు. జనంలో మంచి పేరు పొందేందుకే అండమాన్-నికోబార్ దీవులకు మళ్లీ పేర్లు పెట్టారని పశ్చిమ బెంగాల్ సీఎం మమత ఆరోపించారు.
ఆ ముగ్గురూ..
అండమాన్- నికోబార్ దీవులకు ‘రియల్ హీరో’ల పేర్లు పెట్టారు. వారిలో ముగ్గురు మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. వారు హిమాచల్ప్రదేశ్కు చెందిన రైఫిల్మన్ సంజయ్ కుమార్, ఉత్తరప్రదేశ్కు చెందిన గ్రెనెడర్ యోగేందర్ సింగ్ యాదవ్, జమ్మూకు చెందిన నైబ్ సుబెదర్ బనా సింగ్. వీరిలో యోగేందర్ సింగ్ 19 ఏళ్లకే పురస్కారం అందుకున్నారు.