మొఘల్‌ గార్డెన్స్‌ ఇక అమృత్‌ ఉద్యాన్‌

ABN , First Publish Date - 2023-01-29T02:58:19+05:30 IST

రాష్ట్రపతిభవన్‌లోని మొఘల్‌ గార్డెన్స్‌ పేరును అమృత్‌ ఉద్యాన్‌గా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయి

మొఘల్‌ గార్డెన్స్‌ ఇక  అమృత్‌ ఉద్యాన్‌

న్యూఢిల్లీ, జనవరి 28: రాష్ట్రపతిభవన్‌లోని మొఘల్‌ గార్డెన్స్‌ పేరును అమృత్‌ ఉద్యాన్‌గా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తోన్న ‘ఆజాదీకా అమృత్‌’ మహోత్సవ్‌ థీమ్‌కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ పేరు పెట్టినట్లు ఆమె డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ నవికా గుప్తా తెలిపారు. రాష్ట్రపతిభవన్‌లో ప్రతి ఏటా నిర్వహించే ఉద్యాన్‌ ఉత్సవ్‌ను ఆదివారం రాష్ట్రపతి ప్రారంభించనున్నారని ఆమె తెలిపారు. రాష్ట్రపతిభవన్‌లో మొత్తం 15 ఎకరాల విస్తీర్ణంలో మూడు గార్డెన్లు ఉన్నాయి. అవి శ్రీనగర్‌లోని మొఘల్‌గార్డెన్‌ను పోలి ఉన్నాయనే ఉద్దేశంతో ప్రజలు వాటిని మొఘల్‌ గార్డెన్స్‌గా పిలుస్తున్నారు.

Updated Date - 2023-01-29T02:58:21+05:30 IST