The Elephant Whisperers : ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’తో మోదీ

ABN , First Publish Date - 2023-04-10T01:24:17+05:30 IST

తమిళనాడులోని నీలగిరి జిల్లా ముదుమలై తెప్పకాడు ఏనుగుల సంరక్షణ శిబిరాన్ని ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు.

The Elephant Whisperers :  ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’తో మోదీ

తమిళనాడులోని నీలగిరి జిల్లా ముదుమలై తెప్పకాడు ఏనుగుల సంరక్షణ శిబిరాన్ని ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ డాక్యుమెంటరీ నటీనటులు రఘు, బొమ్మి దంపతులను శాలువాలతో సత్కరించి, కానుకలు అందజేశారు. వారు పెంచుతున్న గున్నఏనుగులకు చెరకుగడలు, పండ్లను తినిపించారు. గజరాజు ఆశీర్వాదం పొందారు. మావటీలతో కబుర్లాడుతూ గంటకుపైగా అక్కడ సందడి చేశారు. కాగా, ఏనుగుల సేవలోనే తరిస్తున్నామని, తమ జీవితానికి ఇది చాలని, ప్రధాని తమను కలవడం మధుర స్మృతి అంటూ రఘు, బొమ్మి ఆనందపరవశులయ్యారు.

Updated Date - 2023-04-10T01:24:17+05:30 IST