రైళ్లలో వాట్సాప్ ద్వారా భోజనం ఆర్డర్
ABN , First Publish Date - 2023-02-07T03:24:33+05:30 IST
రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి వాట్సాప్ ద్వారా భోజనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ ఇప్పటికే కొన్ని రూట్లలో +91 8750001323 వాట్సాప్ నంబర్ ద్వారా భోజనం ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి వాట్సాప్ ద్వారా భోజనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ ఇప్పటికే కొన్ని రూట్లలో +91 8750001323 వాట్సాప్ నంబర్ ద్వారా భోజనం ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా ఠీఠీఠీ.ఛ్చ్ట్ఛిటజీుఽజ.జీటఛ్టిఛి. ఛిౌ.జీుఽ వెబ్సైట్ను రూపొందించింది. ‘వాట్సప్ ద్వారా ఈ-కేటరింగ్ సర్వీస్ను కొన్ని రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. ప్రయాణికుల నుంచి మంచి స్పందన, సలహాలు వచ్చాయి. అందుకే ఇతర మరికొన్ని రైళ్లలో అందుబాటులోకి తేవాలనుకుంటున్నాం’ అని రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.