Kerala: కేరళ రైలు దహనం కేసు.. నిందితుడిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ

ABN , First Publish Date - 2023-09-30T19:45:08+05:30 IST

రైల్వే కోచ్ కి నిప్పు పెట్టిన కేసులో నిందితుడిపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎన్ఐఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. షారుఖ్ అలియాస్ షారుక్ సైఫీ (27), 2023 ఏప్రిల్ 2న అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ D1 కోచ్‌కు నిప్పు పెట్టాడు. కోచ్ లో మంటలు చెలరేగి చిన్నారి సహా ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడ్డారు.

Kerala: కేరళ రైలు దహనం కేసు.. నిందితుడిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ

తిరువనంతపురం: రైల్వే కోచ్ కి నిప్పు పెట్టిన కేసులో నిందితుడిపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎన్ఐఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. షారుఖ్ అలియాస్ షారుక్ సైఫీ (27), 2023 ఏప్రిల్ 2న అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ D1 కోచ్‌కు నిప్పు పెట్టాడు. కోచ్ లో మంటలు చెలరేగి చిన్నారి సహా ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.


తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ కేసులో నిందితుడైన సైఫీ ప్రయాణికులపై పెట్రోల్‌ చల్లి వారిని చంపాలనే ఉద్దేశంతో లైటర్‌ని ఉపయోగించి బోగీకి నిప్పంటించాడని ఛార్జ్‌షీట్‌లో ఉంది. ఉగ్రవాదులతో అతనికి సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఎన్ఐఏ కేసు దర్యాప్తు క్రమంలో ఢిల్లీలోని 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. పలువురు సాక్షులను విచారించడంతోపాటు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనపరుచుకుంది.

Updated Date - 2023-09-30T19:45:53+05:30 IST