Karnataka: 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2023-05-20T10:11:05+05:30 IST

శనివారం కొలువు తీరనున్న కర్ణాటక రాష్ట్ర కేబినెట్‌లో 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Karnataka: 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం
Karnataka swearing in today

బెంగళూరు: శనివారం కొలువు తీరనున్న కర్ణాటక రాష్ట్ర కేబినెట్‌లో 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.(8 Congress MLA) ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ లతో పాటు 8 మంది కేబినెట్ మంత్రులు ప్రమాణం చేయనున్నారు.(take oath) మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కేజీ జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జార్కిహోలి, ప్రియాంక్ ఖర్గే,రామలింగారెడ్డి, బీజడ్ జమీర్ అహ్మద్ ఖాన్ కేబినెట్ మంత్రులుగా(cabinet ministers) ప్రమాణస్వీకారం చేయనున్నట్లు శనివారం ఉదయం పార్టీ వర్గాలు వెల్లడించాయి.

బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవంలో(Karnataka swearing in today) కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు పాల్గొననున్నారు.కేబినెట్ మంత్రుల్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు చోటు దక్కింది.

Updated Date - 2023-05-20T11:53:31+05:30 IST