విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు

ABN , First Publish Date - 2023-05-18T03:31:32+05:30 IST

ఆకాశంలో ఎగురుతుండగా విమానం ఒక్కసారిగా ఊగిపోతే? బుధవారం ఢిల్లీ నుంచి సిడ్నీకి వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలోని ప్రయాణికులకు అంతకుమించి

విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు

న్యూఢిల్లీ, మే 17: ఆకాశంలో ఎగురుతుండగా విమానం ఒక్కసారిగా ఊగిపోతే? బుధవారం ఢిల్లీ నుంచి సిడ్నీకి వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలోని ప్రయాణికులకు అంతకుమించి జీవితాంతం గుర్తుండిపోయే భయానక అనుభవం ఎదురైంది. విమానం తీవ్ర కుదుపునకు లోనవడంతో సీట్లలోంచి ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన రెండు గంటల తర్వాత ఈ ఘటన జరిగింది. వాతావరణ మార్పులే ఇందుకు కారణమని చెబుతున్నారు.

Updated Date - 2023-05-18T03:31:32+05:30 IST