భారత్-బ్రిటన్ భద్రతా సలహాదారుల భేటీ
ABN , First Publish Date - 2023-02-06T00:39:42+05:30 IST
భారత్, బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎ్సఏ)లు అజిత్ డోభాల్, టిమ్ బారో మధ్య లండన్లో జరిగిన సమావేశానికి ఊహించని అతిథి ఒకరు హాజరయ్యారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆకస్మికంగా
అనుకోని అతిథిగా బ్రిటన్ ప్రధాని సునాక్ .. డోభాల్తో ముచ్చట
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: భారత్, బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎ్సఏ)లు అజిత్ డోభాల్, టిమ్ బారో మధ్య లండన్లో జరిగిన సమావేశానికి ఊహించని అతిథి ఒకరు హాజరయ్యారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆకస్మికంగా వచ్చి వీరిద్దరి భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు డోభాల్లో ముచ్చటించారు. కాగా, గత మంగళవారం వాషింగ్టన్లో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్తో సమావేశం అనంతరం డోభాల్ లండన్ చేరుకున్నారు. అక్కడ శనివారం టిమ్ బారోతో భేటీ అయ్యారు.