Church Pastor: కడుపు మాడ్చుకొని చనిపోతే జీసస్‌ను కలుస్తారు!

ABN , First Publish Date - 2023-05-15T02:35:19+05:30 IST

ఆకలితో అలమటించి చనిపోతే జీసస్‌ను కలుస్తారన్న ఓ చర్చి పాస్టర్‌ మాటలు నమ్మి అనేకమంది అమాయకులు కడుపు కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు.

Church Pastor: కడుపు మాడ్చుకొని చనిపోతే జీసస్‌ను కలుస్తారు!

పాస్టర్‌ మాటలు నమ్మి 210 మంది మృతి

వీరిలో పదుల సంఖ్యలో చిన్నారులు

కెన్యాలో వెలుగు చూసిన దారుణం

ఇంకా తెలియని 610 మంది జాడ

నైరోబీ, మే 14: ఆకలితో అలమటించి చనిపోతే జీసస్‌ను కలుస్తారన్న ఓ చర్చి పాస్టర్‌ మాటలు నమ్మి అనేకమంది అమాయకులు కడుపు కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. పాస్టర్‌ ఆదేశాలతో పిల్లలు త్వరగా చనిపోవడానికి వారిని మండుటెండలో ఉంచి కడుపు మాడ్చి చంపారు. ఈ దారుణం కెన్యాలో వెలుగుచూసింది. అమాయకుల మరణానికి కారణమైన పాస్టర్‌ పాల్‌ మెకంజీ, అతని భార్యతో పాటు ఇప్పటి వరకు 26 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొంతమంది పిల్లలను కొన ఊపిరితో ఉండగానే ఖననం చేశారని పోలీసులు విచారణలో వెల్లడైంది. ఇంకా సుమారు 610 మంది జాడ ఇంకా తెలియడం లేదు. వారి కోసం గాలిస్తున్నారు. ఒకప్పుడు టాక్సీ డ్రైవర్‌గా పనిచేసిన మెకంజీ పాస్టర్‌ అవతారమెత్తాడు. ఏప్రిల్‌ 15 నాటికి ప్రపంచం అంతమైపోతుందని, ఆలోగా ఆకలితో చనిపోతే జీసస్‌ను కలుస్తారని ప్రచారం నిర్వహించాడు. ప్రజలు అతన్ని నమ్మి ఆకలితో చనిపోయారు. అలా చనిపోయిన వారి సామూహిక సమాధి ఒకదాన్ని మొదట ఏప్రిల్‌లో గుర్తించారు. వేర్వేరుచోట్ల ఇప్పటి వరకు 201 మంది మృతదేహాలను వెలికితీశారు.

Updated Date - 2023-05-15T02:35:19+05:30 IST