JOYAL : చైనాతో ‘ఘమండియా’ మిలాఖత్‌!

ABN , First Publish Date - 2023-08-09T03:38:50+05:30 IST

విపక్షాలు చైనాతో మిలాఖతై దేశ భద్రత, ఐక్యత, సమగ్రతలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని కేంద్రమంత్రి, రాజ్యసభలో అధికారపక్ష నేత పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు.

JOYAL : చైనాతో ‘ఘమండియా’ మిలాఖత్‌!

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఆరోపణలు

న్యూఢిల్లీ, ఆగస్టు 8: విపక్షాలు చైనాతో మిలాఖతై దేశ భద్రత, ఐక్యత, సమగ్రతలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని కేంద్రమంత్రి, రాజ్యసభలో అధికారపక్ష నేత పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు. పరస్పర ప్రయోజనాల కోసమే ఈ పార్టీలు ఒక్కటై ‘ఘమండియా’ (అహంకారపూరిత) కూటమిగా ఏర్పడ్డాయని విమర్శించారు. న్యూస్‌క్లిక్‌ వెబ్‌సైట్‌కు చైనా నిధులు పంపించటాన్ని న్యూయార్క్‌టైమ్స్‌ కథనం వెలుగులోకి తేవటంతో విపక్షాల బండారం బయటపడిందన్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం అంశాన్ని బీజేపీ ఎంపీ సుదాంశు త్రివేది రాజ్యసభలో లేవనెత్తిన నేపథ్యంలో మంగళవారం విలేకర్లతో పీయూష్‌ గోయల్‌ మాట్లాడారు. న్యూస్‌క్లిక్‌ అంశం చాలా తీవ్రమైనదని, ప్రజాస్వామ్యం, పత్రికాస్వేచ్ఛ గురించి మాట్లాడే వారి చిత్తశుద్ధి పట్ల ఇది పలు సందేహాలను లేవనెత్తుతోందని గోయల్‌ అన్నారు. గోయల్‌ వ్యాఖ్యలపై విపక్ష కూటమి-ఇండియా నేతలు రాజ్యసభ చైర్మన్‌కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. గోయల్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-08-09T03:39:11+05:30 IST