నైజీరియన్ నుంచి 2 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
ABN , First Publish Date - 2023-10-23T01:02:48+05:30 IST
బెంగళూరు నగరం దొడ్డనాగ మంగల వీరభద్రస్వామి లేఔట్లో సీసీబీ పోలీసులు ఆదివారం రూ.2 కోట్ల
బెంగళూరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగరం దొడ్డనాగ మంగల వీరభద్రస్వామి లేఔట్లో సీసీబీ పోలీసులు ఆదివారం రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా దేశానికి చెందిన విక్టర్ ఒబిన్నా చుక్విడి ఇంటి నుంచి 2.43 కిలోల ఎండీఎంఏ డ్రగ్స్, 2 మొబైల్ ఫోన్లు, తూనిక యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.