Mamata : సమాఖ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు

ABN , First Publish Date - 2023-03-31T03:38:54+05:30 IST

బీజేపీ సమాఖ్య స్ఫూర్తిని ధ్వంసం చేస్తోందని, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను అణగదొక్కాలని చూస్తోందని తృణమూల్‌ ..

Mamata : సమాఖ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు

కోల్‌కతా, మార్చి 30: బీజేపీ సమాఖ్య స్ఫూర్తిని ధ్వంసం చేస్తోందని, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను అణగదొక్కాలని చూస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్‌కు ఉపాధి హామీ, ఇతర పథకాలకు నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ మమత బుధవారం మధ్యాహ్నం నుంచి 30 గంటల నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రాల జీఎస్టీ సొమ్మును దోచుకుంటున్నారని, ఉపాధి హామీ, ఇతర పథకాల నిధులు నిలిపివేశారని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే చట్టసభల నుంచి సస్పెండ్‌ చేస్తారని, ఈడీ, సీబీఐని పంపుతారని.. నియంతల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

Updated Date - 2023-03-31T03:38:54+05:30 IST