Kishan Reddy: కిషన్‌రెడ్డి ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యుల తాజా ప్రకటన

ABN , First Publish Date - 2023-05-01T15:54:52+05:30 IST

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై న్యూఢిల్లీ లోని ఎయిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు తాజా సమాచారం వెల్లడించారు.

Kishan Reddy: కిషన్‌రెడ్డి ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యుల తాజా ప్రకటన
Union Minister G Kishan Reddy AIIMS Delhi

న్యూఢిల్లీ: కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి (Union Minister G.Kishan Reddy) ఆరోగ్య పరిస్థితిపై న్యూఢిల్లీ(New Delhi)లోని ఎయిమ్స్‌ ఆస్పత్రి(AIIMS Hospital) వైద్యులు తాజా సమాచారం వెల్లడించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు.

వాస్తవానికి కిషన్ రెడ్డి నిన్న అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో బాధపడుతున్న ఆయన్ను ఆదివారం రాత్రి గం.10.50 నిమిషాల సమయంలో న్యూఢిల్లీ(New Delhi)లోని ఎయిమ్స్‌ ఆస్పత్రి(AIIMS Hospital) తో చేర్పించారు. ఎయిమ్స్‌లోని కార్డియాక్‌ న్యూరో సెంటర్‌(Cardiothoracic & Neurosciences Centre) లోని కార్డియాక్‌ కేర్‌ యూనిట్‌(Cardiac Care Centre)లో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కేంద్రమంత్రికి గ్యాస్ సమస్య ఉందని అని వైద్యులు తేల్చారు.

2019లో కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు.

Updated Date - 2023-05-01T15:54:55+05:30 IST