సీయూఈటీ యూజీ ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2023-07-16T02:41:08+05:30 IST
ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష(సీయూఈటీ) అండర్ గ్రాడ్యుయేట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.
న్యూఢిల్లీ, జూలై 15: ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష(సీయూఈటీ) అండర్ గ్రాడ్యుయేట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. సీయూఈటీ రెండో ఎడిషన్ పరీక్షకు మొత్తం 11.11 లక్షల మంది హాజరుకాగా వారిలో 22 వేల మంది 100 పర్సెంటైల్ సాధించారు. అత్యధికంగా ఇంగ్లి్షలో 5,685 మంది విద్యార్థులు వందశాతం స్కోరు సాధించగా.. బయాలజీ/బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీలో 4,850 మంది, ఎకనామిక్స్లో 2,836 మంది వందశాతం స్కోరు సాధించారు.