సామాన్యుడి సత్తా తెలియకే ‘ముద్ర’పై విమర్శలు
ABN , First Publish Date - 2023-04-14T02:42:01+05:30 IST
ముద్ర పథకాన్ని ఎగతాళి చేసేవారికి సామాన్యుల సామర్థ్యంపై అవగాహన లేదని ప్రధాని మోదీ అన్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ముద్ర పథకాన్ని ఎగతాళి చేసేవారికి సామాన్యుల సామర్థ్యంపై అవగాహన లేదని ప్రధాని మోదీ అన్నారు. తమను తాము పెద్ద ఆర్థిక వేత్తలుగా భావించుకుంటూ, ఫోన్ల మీద బడా పారిశ్రామికవేత్తలకు భారీమొత్తంలో రుణాలను కట్టబెట్టినవారే ‘ముద్ర’ను తక్కువ చేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. ముద్రాలో ఇచ్చే రూ. 50వేల రుణంలో ఔత్సాహికులు ఏం వ్యాపారాలు పెట్టుకుంటారని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఇటీవల ప్రశ్నించారు. ఆయనకు పరోక్షంగా చురకలు అంటిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం వీడియో లింక్ ద్వారా ‘రోజ్గార్ మేళా’ను మోదీ ప్రారంభించారు. కొత్తగా 71,506 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు.