Corona: దేశ వ్యాప్తంగా 24 గంటల్లో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయో తెలిస్తే..
ABN , Publish Date - Dec 22 , 2023 | 11:34 AM
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 640 కరోనా కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 2997 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజులో కేరళలో 265 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. కేరళలో ప్రస్తుతం 2606 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీ: దేశంపై కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 640 కరోనా కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. దేశంలో మొత్తంగా నేటి వరకూ 2997 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజులో కేరళలో 265 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. కేరళలో ప్రస్తుతం 2606 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ తరువాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ,మహారాష్ట్ర లో ఎక్కువగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో 5 కొత్త కోవిడ్ కేసులు, ఏపీలో 3 కోవిడ్ కేసులు నమోదు, తమిళనాడు 15, కర్ణాటకలో13 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 19 యాక్టివ్ కేసులు, ఏపీలో 4 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. జెఎన్.1 కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది.