Arunachal Pradesh: ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి

ABN , First Publish Date - 2023-03-16T19:00:57+05:30 IST

వీరిని లెఫ్టెనెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి, మేజర్ జయంత్‌గా గుర్తించారు.

Arunachal Pradesh: ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి
Arunachal Pradesh, Cheetah helicopter

న్యూఢిల్లీ: భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ చీతా (Cheetah helicopter) అరుణాచల్ ప్రదేశ్‌(Arunachal Pradesh)లోని బొమ్డిలలో కూలిపోయిన ఘటనలో ఇద్దరు పైలట్లు చనిపోయారు. వీరిని లెఫ్టెనెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి, మేజర్ జయంత్‌గా గుర్తించారు. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన ఈ హెలికాప్టర్ గురువారం ఉదయం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోయింది. బొమ్డిలకు పశ్చిమ దిశలో ఉన్న మండల(Mandala) సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. గువాహటి రక్షణ రంగ ప్రజా సంబంధాల అధికారి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ ఈ వివరాలను ఓ ప్రకటనలో తెలిపారు. ఈ హెలికాప్టర్ సెంగె నుంచి మిస్సమరి వెళ్తుండగా కుప్పకూలింది.

రంగంలోకి దిగిన గాలింపు బృందాలకు బంగ్లాజాప్(Banglajaap) గ్రామ సమీపంలో హెలికాఫ్టర్ శకలాలు దొరికాయి. ఘటనపై విచారణకు ఆదేశించారు.

Updated Date - 2023-03-16T19:10:52+05:30 IST