లిబియా తీరంలో పడవ మునక
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:36 AM
లిబియా తీరంలో అక్రమ వలసదారులతో వెళ్తున్న ఓ పడవ మునిగి 60 మందికి పైగా గల్లంతయ్యారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్
కైరో, డిసెంబరు 17: లిబియా తీరంలో అక్రమ వలసదారులతో వెళ్తున్న ఓ పడవ మునిగి 60 మందికి పైగా గల్లంతయ్యారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐవోఎమ్) వెల్లడించింది. పడవలో మొత్తం 86 మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు తెలిపింది. తీరంలో వచ్చిన బలమైన గాలుల తాకిడికి పడ వ బోల్తాపడినట్లు ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు.