నిషేధిత పీఎల్ఎఫ్ఐ చీఫ్ దినేశ్ గోపే అరెస్టు
ABN , First Publish Date - 2023-05-22T03:41:53+05:30 IST
నిషేధిత మావోయిస్టు సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎల్ఎఫ్ఐ) చీఫ్ దినేశ్ గోపెను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆదివారం అరెస్టు చేసింది.
న్యూఢిల్లీ, మే 21: నిషేధిత మావోయిస్టు సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎల్ఎఫ్ఐ) చీఫ్ దినేశ్ గోపెను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆదివారం అరెస్టు చేసింది. ఝార్ఖండ్ పోలీసులతో సంయుక్తం గా నిర్వహించిన ఆపరేషన్లో భాగంగా దినేశ్ను ఎన్ఐఏ నేపాల్లో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఝార్ఖండ్లో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ అయిన దినేశ్ గోపేపై రూ.30 లక్షల రివార్డు కూడా ఉంది.