Share News

Karnataka: మహిళను వివస్త్రను చేసి స్తంభానికి కట్టేసి దాడి

ABN , First Publish Date - 2023-12-12T13:40:33+05:30 IST

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మహిళను వివస్త్రను చేసి స్తంభానికి కట్టి దాడి చేశారు. బెళగావి జిల్లాలోని వంటమూరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పరారంవడంతో యువకుడి తల్లిపై యువతి కుటుంబం దాడి చేసింది.

Karnataka: మహిళను వివస్త్రను చేసి స్తంభానికి కట్టేసి దాడి

బెంగుళూరు: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మహిళను వివస్త్రను చేసి స్తంభానికి కట్టి దాడి చేశారు. బెళగావి జిల్లాలోని వంటమూరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పరారంవడంతో యువకుడి తల్లిపై యువతి కుటుంబం దాడి చేసింది. గ్రామంలోని ఓ యువతిని బాదితురాలి కుమారుడు కొన్నేళుగా ప్రేమిస్తున్నాడు. పెళ్లికి అంగీకరించరనే కారణంతో ప్రేమికులు పరారీలో ఉన్నారు. దీంతో యువకుని ఇంటిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. యువకుడి తల్లిని యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపరిచారు. ఆదివారం రాత్రి దాడి అనంతరం వివస్త్రను చేసి స్తంభానికి కట్టేశారు. దారుణ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేశారు. మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందుతులపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

Updated Date - 2023-12-12T13:40:34+05:30 IST