కైలాసదేశం పౌరసత్వానికి అప్లై చేసుకోండి

ABN , First Publish Date - 2023-03-05T01:11:04+05:30 IST

తాను సృష్టించిన ‘కైలాస దేశం’లో పౌరసత్వం కావాలంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలంటూ వివాదాస్పద స్వామి నిత్యానంద ప్రకటించారు. ఇటీవల జెనీవాలో జరిగిన..

కైలాసదేశం పౌరసత్వానికి అప్లై చేసుకోండి

వివాదాస్పద స్వామి నిత్యానంద పిలుపు

చెన్నై, మార్చి 4(ఆంధ్రజ్యోతి): తాను సృష్టించిన ‘కైలాస దేశం’లో పౌరసత్వం కావాలంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలంటూ వివాదాస్పద స్వామి నిత్యానంద ప్రకటించారు. ఇటీవల జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో కైలాస దేశం తరఫున మహిళా ప్రతినిధులు పాల్గొనడంతో, తమ దేశాన్ని ఐరాస గుర్తించినట్లయిందని పేర్కొన్న నిత్యానంద హర్షం వ్యక్తం చేశారు. కైలాస దేశం పౌరసత్వం కోసం ఠీఠీఠీ.జ్చుజీజ్చూట్చ.ౌటజ/్ఛఛిజ్టీజ్డ్ఛీుఽ అనే వెబ్‌సైట్‌కు దరఖాస్తులు పంపాలని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2023-03-05T01:11:04+05:30 IST