జాబిల్లి దిశగా మరో అడుగు..
ABN , First Publish Date - 2023-07-21T03:28:39+05:30 IST
ఈ నెల 14న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3.. జాబిల్లి దిశగా మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతం భూ కక్ష్యలో
చంద్రయాన్-3కు నాలుగో దశ కక్ష్య పెంపు
సూళ్లూరుపేట, బెంగళూరు, జూలై 20: ఈ నెల 14న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3.. జాబిల్లి దిశగా మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతం భూ కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-3 వ్యోమనౌకకు గురువారం నాలుగో దశ కక్ష్య పెంపు ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తిచేశారు. బెంగళూరులోని ఇస్ట్రాక్ ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుంచి ఉదయం 6.45 గంటలకు స్పేస్క్రా్ఫ్టలో ఉన్న ఇంధనాన్ని మండించి ఆర్బిట్ రైజింగ్ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తిచేసినట్టు ఇస్రో వెల్లడించింది. కాగా, చంద్రయాన్-3కి భూ కక్ష్యలో చివరి దశ కక్ష్య పెంచే ప్రక్రియ (ఐదోసారి)ను ఈ నెల 25న నిర్వహించి.. చంద్రుని కక్ష్య వైపు మళ్లించనున్నారు. చంద్రయాన్-3 ఆగస్టు 1న చంద్రుడి కక్ష్యకు చేరుకొనే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలిపాయి.