ANI: నకిలీ వార్తలు అందిస్తున్న ‘ఏఎన్‌ఐ’

ABN , First Publish Date - 2023-02-25T02:27:26+05:30 IST

భారత్‌కు చెందిన ప్రముఖ వార్తా సేకరణ సంస్థ ‘ఏఎన్‌ఐ’ నకిలీ వార్తలు అందజేస్తోందని యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన డిస్‌ఇన్ఫో ల్యాబ్‌ అనే లాభాపేక్ష రహిత సంస్థ పేర్కొంది.

ANI: నకిలీ వార్తలు అందిస్తున్న ‘ఏఎన్‌ఐ’

డిస్‌ ఇన్ఫో ల్యాబ్‌ ఆరోపణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: భారత్‌కు చెందిన ప్రముఖ వార్తా సేకరణ సంస్థ ‘ఏఎన్‌ఐ’ నకిలీ వార్తలు అందజేస్తోందని యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన డిస్‌ఇన్ఫో ల్యాబ్‌ అనే లాభాపేక్ష రహిత సంస్థ పేర్కొంది. గురువారం విడుదల చేసిన తాజా అధ్యయన నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ‘కల్పిత వర్గాల సమాచారం’ అందిస్తోందని తెలిపింది. మరణించిన వ్యక్తులు, మూతపడ్డ సంస్థల పేరుతో పలుమార్లు సమాచారాన్ని అందజేసిందని పేర్కొంది. ముఖ్యంగా పాకిస్థాన్‌, చైనాలను విమర్శించే సందర్భంలో ఇలా చేసిందని తెలిపింది. అసలు ఉనికిలోనే లేని జర్నలిస్టులు, బ్లాగర్లు రాజకీయ నిపుణుల పేరుతో కథనాలు ఇచ్చిందని ఆరోపించింది. ఈ విషయాన్ని ఏఎన్‌ఐ సంపాదకురాలు స్మితా ప్రకాశ్‌ వద్ద ప్రస్తావించగా ఆరోపణలను కొట్టి పారేశారు. ఆ నివేదిక తప్పులతో కూడుకొన్నదని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-02-25T02:27:27+05:30 IST