కువైట్ అమీర్ షేక్ నవాఫ్ కన్నుమూత
ABN , Publish Date - Dec 17 , 2023 | 05:38 AM
కువైట్ అమీర్ (పరిపాలకుడు) షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబా శనివారం కన్నుమూశారు. అయన వయసు 86 ఏళ్లు. కువైట్ అమీర్గా ఆయన మూడేళ్లపాటు
దుబాయ్, డిసెంబరు 16: కువైట్ అమీర్ (పరిపాలకుడు) షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబా శనివారం కన్నుమూశారు. అయన వయసు 86 ఏళ్లు. కువైట్ అమీర్గా ఆయన మూడేళ్లపాటు పరిపాలన చేశారు. తన పాలన కాలంలో దేశ అంతర్గత సమస్యల పరిష్కారంపైనే ఆయన అధికంగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం అమీర్ పదవిని ఆయన సవతి సోదరుడు షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ చేపట్టారు. 83 ఏళ్ల షేక్ మెషాల్ ఇంతవరకు ఉప నాయకునిగా, క్రౌన్ ప్రిన్స్గా వ్యవహరించారు. షేక్ నవాఫ్ మరణానికి భారత్ సంతాపం తెలిపింది. ఆదివారం సంతాప దినాన్ని పాటించనుంది. సంతాప సూచకంగా జాతీయ జెండాను అవనతం చేసి సగం వరకు ఎగుర వేయనుంది. అమీర్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.