అహ్మద్నగర్ ఇకపై అహిల్యానగర్
ABN , First Publish Date - 2023-06-01T00:46:44+05:30 IST
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా పేరును అహిల్యాదేవి హోల్కర్ జిల్లాగా మారుస్తూ శిందే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.....
అహ్మద్నగర్, మే 31: మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా పేరును అహిల్యాదేవి హోల్కర్ జిల్లాగా మారుస్తూ శిందే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అహ్మద్నగర్ జిల్లా చౌందీలో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, 18వ శతాబ్దంలో ఇండోర్ రాష్ట్రాన్ని పాలించిన అహిల్యాదేవి హోల్కర్ పేరును అహ్మద్నగర్ జిల్లాకు పెట్టడం తమకు గర్వంగా ఉందని చెప్పారు. మే 31న ఆమె 298వ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, అహిల్యాదేవి హోల్కర్ లేకపోతే దేశంలో కాశీ, శివుని ఆలయాలు ఉండేవి కావని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో ఔరాంగాబాద్ పేరును ఛత్రపతి షంబాజీనగర్గా, ఉస్మానాబాద్ పేరును ధారాశివ్గా మార్చింది.