అహ్మద్‌నగర్‌ ఇకపై అహిల్యానగర్‌

ABN , First Publish Date - 2023-06-01T00:46:44+05:30 IST

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా పేరును అహిల్యాదేవి హోల్కర్‌ జిల్లాగా మారుస్తూ శిందే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.....

అహ్మద్‌నగర్‌ ఇకపై అహిల్యానగర్‌

అహ్మద్‌నగర్‌, మే 31: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా పేరును అహిల్యాదేవి హోల్కర్‌ జిల్లాగా మారుస్తూ శిందే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అహ్మద్‌నగర్‌ జిల్లా చౌందీలో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, 18వ శతాబ్దంలో ఇండోర్‌ రాష్ట్రాన్ని పాలించిన అహిల్యాదేవి హోల్కర్‌ పేరును అహ్మద్‌నగర్‌ జిల్లాకు పెట్టడం తమకు గర్వంగా ఉందని చెప్పారు. మే 31న ఆమె 298వ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ మాట్లాడుతూ, అహిల్యాదేవి హోల్కర్‌ లేకపోతే దేశంలో కాశీ, శివుని ఆలయాలు ఉండేవి కావని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో ఔరాంగాబాద్‌ పేరును ఛత్రపతి షంబాజీనగర్‌గా, ఉస్మానాబాద్‌ పేరును ధారాశివ్‌గా మార్చింది.

Updated Date - 2023-06-01T00:46:44+05:30 IST