Actress Gayatri Raghuram: బీజేపీపై నటి గాయత్రి యుద్ధం

ABN , First Publish Date - 2023-01-15T07:18:52+05:30 IST

ఇటీవల బీజేపీ నుంచి సస్పెండై, ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసిన నటి గాయత్రి రఘురాం(Actress Gayatri Raghuram).. ఇప్పుడు కసి తీర్చు

Actress Gayatri Raghuram: బీజేపీపై నటి గాయత్రి యుద్ధం

- 27 నుంచి పాదయాత్ర

పెరంబూర్‌(చెన్నై), జవనరి 14: ఇటీవల బీజేపీ నుంచి సస్పెండై, ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసిన నటి గాయత్రి రఘురాం(Actress Gayatri Raghuram).. ఇప్పుడు కసి తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బీజేపీ వైఖరిని ఖండిస్తూ ఈనెల 27వ తేదీన చెన్నై నుంచి కన్నియాకుమారి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ఆమె శనివారం ట్విట్టర్‌లో ప్రకటించారు. బీజేపీలో మహిళలకు అవమానాలు పెరగడంతో పాటు భద్రత కరువైందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేలా చెన్నై నుంచి పాదయాత్ర(Padayatra) చేపట్టనున్నట్లు తెలిపారు. తన పాదయాత్రలో ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. ఎలాంటి బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని, ప్రాణాలు పోయినా పాదయాత్ర చేపడతానన్నారు. ఈ పాదయాత్ర రాజకీయాల్లో ఉంటూ అవమానాలు ఎదుర్కొంటున్న మహిళలు, సాధారణ ప్రజలు, బాధిత చిన్నారులు, బాధిత మహిళా పోలీసుల కోసమని గాయత్రి రఘురాం ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-01-15T07:18:55+05:30 IST