కర్ణాటకలో కొత్త రికార్డు

ABN , First Publish Date - 2023-05-12T03:08:01+05:30 IST

కర్ణాటక ఎన్నికల్లో పోలింగ్‌ శాతం రికార్డు సృష్టించినట్టు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. సవరించిన పోలింగ్‌ శాతాన్ని ఈసీ గురువారం

కర్ణాటకలో కొత్త రికార్డు

73.19% పోలింగ్‌ నమోదు: ఈసీ

రేపు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి

బెంగళూరు, మే 11(ఆంధ్రజ్యోతి): కర్ణాటక ఎన్నికల్లో పోలింగ్‌ శాతం రికార్డు సృష్టించినట్టు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. సవరించిన పోలింగ్‌ శాతాన్ని ఈసీ గురువారం వెల్లడించింది. 73.19 శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపింది. ఇది కర్ణాటక ఎన్నికల్లో కొత్త రికార్డు అని పేర్కొంది. చిక్కబళ్లాపుర జిల్లాలో అత్యధికంగా 85.56 శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపింది. 10 జిల్లాల్లో 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైనట్టు వివరించింది. కాగా, శుక్రవారం ఓట్ల లెక్కింపుతోపాటు ఫలితాలు వెల్లడించేందు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. వివిధ సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు విభిన్నంగా వెలువడటంతో అధికారపక్షం బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కలవరపాటుకు గురవుతున్నాయి. అయితే, ఈసారి కూడా హంగ్‌ వస్తుందని జేడీఎస్‌ ఆశాభావంతో ఉంది.

Updated Date - 2023-05-12T03:08:01+05:30 IST