మెక్సికోలో శరణార్థి శిబిరంలో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2023-03-29T05:52:47+05:30 IST
మెక్సికోలో ఓ శరణార్ధి శిబిరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు.
40 మంది వలసదారులు మృతి
మెక్సికో, మార్చి 28: మెక్సికోలో ఓ శరణార్ధి శిబిరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం అర్ధరాత్రి సంభవించిన ఈ దుర్ఘటనలో మరో 29 మంది గాయపడ్డారని నేషనల్ మైగ్రేషన్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఎమ్ఐ) మంగళవారం వెల్లడించింది. ఘటనకు ముందు శిబిరంలో గొడవ జరిగినట్లు ఓ స్థానిక మీడియా పేర్కొంది.