Share News

కళ్లు పీకేసి.. మర్మాంగాలను ఛిద్రం చేసి

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:35 AM

ఆలయానికి వెళ్లిన పూజారి ఆరు రోజుల పాటు అదృశ్యమై చివరకు విగత జీవిగా మారాడు. కళ్లు పీకేసి, మర్మాంగాలను ఛిద్రం చేసి అతడిని దారుణంగా హత్య చేశారు.

కళ్లు పీకేసి.. మర్మాంగాలను ఛిద్రం చేసి

బిహార్‌లో శివాలయ పూజారి దారుణ హత్య

గోపాల్‌గంజ్‌, డిసెంబరు 17: ఆలయానికి వెళ్లిన పూజారి ఆరు రోజుల పాటు అదృశ్యమై చివరకు విగత జీవిగా మారాడు. కళ్లు పీకేసి, మర్మాంగాలను ఛిద్రం చేసి అతడిని దారుణంగా హత్య చేశారు. మృతదేహంపై తూటా గాయాలు ఉండడంతో బంధువులు, గ్రామస్థులు ఆగ్రహాంతో పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. వారి వాహనానికి నిప్పుపెట్టారు. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌ జిల్లా దనాపూర్‌లో జరిగిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్‌ స్థానిక శివాలయంలో పూజారి. ఈ నెల 12న బయటకు వచ్చిన అతను తిరిగి ఇంటికి చేరలేదు. శనివారం సాయంత్రం పాల ఫ్యాక్టరీ సమీపంలో మనోజ్‌ మృతదేహం లభ్యమైంది. శరీర భాగాలను ఛిద్రం చేయడంతోపాటు అతడి మెడ వద్ద తూటాతో కాల్చినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Updated Date - Dec 18 , 2023 | 03:35 AM