41 లక్షల లీటర్ల నీళ్లు తోడించిన

ABN , First Publish Date - 2023-06-01T00:49:57+05:30 IST

సెల్‌ఫోన్‌ గాలించడం కోసం ఛత్తీ్‌సగఢ్‌లోని ఖేర్కట్ట డ్యామ్‌లోని 41 లక్షల లీటర్ల నీళ్లు తోడించిన నీటిపారుదల శాఖ అధికారి ఆర్‌ఎల్‌ దివార్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది...

41 లక్షల లీటర్ల నీళ్లు తోడించిన

అధికారిపై సస్పెన్షన్‌ వేటు

రాయ్‌పూర్‌, మే 31 : సెల్‌ఫోన్‌ గాలించడం కోసం ఛత్తీ్‌సగఢ్‌లోని ఖేర్కట్ట డ్యామ్‌లోని 41 లక్షల లీటర్ల నీళ్లు తోడించిన నీటిపారుదల శాఖ అధికారి ఆర్‌ఎల్‌ దివార్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మే 21 నుంచి నాలుగు రోజుల పాటు ఖేర్కట్ట డ్యామ్‌ నుంచి అనధికారంగా నీటిని తోడేస్తున్న దివార్‌(ఇన్‌చార్జి సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌) ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే వేటు వేశామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఛత్తీ్‌సగఢ్‌లోని కోయలిబేడా బ్లాక్‌లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసే రాజేశ్‌ విశ్వా్‌సకు చెందిన సెల్‌ఫోన్‌ ఖేర్కట్ట డ్యామ్‌లో పడగా దాని కోసం నీటిని తోడేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి విశ్వాస్‌ ఇప్పటికే సస్పెన్షన్‌కు గురవ్వగా, అతనికి రూ.53 వేల జరిమానా కూడా విధించారు.

Updated Date - 2023-06-01T00:49:57+05:30 IST