WeMakeScholars: రికార్డు సృష్టించిన ‘వియ్ మేక్ స్కాలర్స్’.. ఒకే రోజు 1000 మందికి విద్యారుణాలు!

ABN , First Publish Date - 2023-03-14T21:02:05+05:30 IST

దేశంలోని అతిపెద్ద స్టడీ అబ్రాడ్ ఫండింగ్ ఎక్స్‌పో (SAFE) విజయవంతమైంది.

WeMakeScholars: రికార్డు సృష్టించిన ‘వియ్ మేక్ స్కాలర్స్’.. ఒకే రోజు 1000 మందికి విద్యారుణాలు!

హైదరాబాద్: దేశంలోని అతిపెద్ద స్టడీ అబ్రాడ్ ఫండింగ్ ఎక్స్‌పో (SAFE) విజయవంతమైంది. హైదరాబాద్‌ బేగంపేటలోని మనోహర్ హోటల్‌లో నిర్వహించిన ఈ ఎక్స్‌పోకు తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు విదేశీ విద్యకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకున్నారు. విద్యార్థులు తమ ప్రొఫైల్‌కు అనుగుణంగా ముఖాముఖి ద్వారా చక్కని మార్గనిర్దేశకత్వాన్ని పొందారు.

edu1.jpg

2 వేల మందికిపైగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది తమకెంతో ఉపయోగపడిందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘వియ్ మేక్ స్కాలర్స్’ ఫౌండర్ దామిని మహాజన్ మాట్లాడుతూ.. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఫండింగ్ సమస్యను తీర్చడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ ఎక్స్‌పో ద్వారా దాదాపు 1000 మంది విద్యార్థులకు సూత్రప్రాయంగా విద్యారుణాలను మంజూరు చేసినట్టు చెప్పారు. ఒకే రోజు ఇంతమందికి రుణాలు మంజూరు చేయడం ఓ రికార్డని అన్నారు.

Updated Date - 2023-03-14T21:02:05+05:30 IST