నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌లో ప్రోగ్రామ్‌లు.. అడ్మిషన్స్ ఎలా ఇస్తారంటే..!

ABN , First Publish Date - 2023-04-17T12:54:01+05:30 IST

నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ యూనివర్సిటీ (National Law Institute University) (ఎన్‌ఎల్‌ఐయూ)-గ్రాడ్యుయేట్‌ ఇన్‌సాల్వెన్సీ ప్రోగ్రామ్‌ (జీఐపీ), మాస్టర్‌ ఆఫ్‌ సైబర్‌ లా అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ(ఎంసీఎల్‌ఐఎస్‌) ప్రోగ్రామ్‌లలో

నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌లో ప్రోగ్రామ్‌లు.. అడ్మిషన్స్ ఎలా ఇస్తారంటే..!

భోపాల్‌లోని నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ యూనివర్సిటీ (National Law Institute University) (ఎన్‌ఎల్‌ఐయూ)-గ్రాడ్యుయేట్‌ ఇన్‌సాల్వెన్సీ ప్రోగ్రామ్‌ (జీఐపీ), మాస్టర్‌ ఆఫ్‌ సైబర్‌ లా అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ(ఎంసీఎల్‌ఐఎస్‌) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి విడివిడిగా నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఎంట్రెన్స్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు.

గ్రాడ్యుయేట్‌ ఇన్‌సాల్వెన్సీ ప్రోగ్రామ్‌(జీఐపీ)

ఇది రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌. దీనికి ఐబీబీఐ గుర్తింపు ఉంది. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఇందులో ఏడాదిపాటు ఇంటెన్సివ్‌ రెసిడెన్షియల్‌ క్లాస్‌ రూం ప్రోగ్రామ్‌; మరో ఏడాది ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ఉంటాయి.

సీట్లు: మొత్తం 40 సీట్లు ఉన్నాయి. జనరల్‌ అభ్యర్థులకు 20, ఓబీసీ అభ్యర్థులకు 11, ఎస్సీ అభ్యర్థులకు 6, ఎస్టీ అభ్యర్థులకు 3 సీట్లు ప్రత్యేకించారు.

అర్హత: ద్వితీయశ్రేణి మార్కులతో ఎల్‌ఎల్‌బీ/ బీఏ ఎల్‌ఎల్‌బీ/బీఏ ఎల్‌ఎల్‌బీ ఆనర్స్‌/ బీఈ/ బీటెక్‌ లేదా పీజీ(ఎకనామిక్స్‌/ ఫైనాన్స్‌/ కామర్స్‌/ మేనేజ్‌మెంట్‌/ ఇన్‌సాల్వెన్సీ) ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యాలిడ్‌ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ఉన్న చార్టర్డ్‌ అకౌంటెంట్‌లు/ కాస్ట్‌ అకౌంటెంట్‌లు/ కంపెనీ సెక్రటరీలు, వ్యాలిడ్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ ఉన్న అడ్వకేట్‌లు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.

వయసు: దరఖాస్తు నాటికి జనరల్‌ అభ్యర్థులకు 28 ఏళ్లు; ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్లు; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు మించకూడదు.

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ వివరాలు: ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌. దీనిని ఐబీపీఎస్‌ నిర్వహిస్తుంది. ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌ నుంచి 20, లీగల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 10, ఫైనాన్షియల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 10, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 15, మేథమెటిక్స్‌ అండ్‌ బేసిక్‌ స్టాటిస్టిక్స్‌ నుంచి 10, లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 10, ఇంగ్లీష్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నుంచి 10 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. డొమైన్‌ నాలెడ్జ్‌ నుంచి 15 డిస్ర్కిప్టివ్‌ క్వశ్చన్స్‌ అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం గంటన్నర. ఇందులో సాధించిన మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. సంస్థ నిర్ణయం మేరకు అడ్మిషన్స్‌ ఇస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.3,000

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 27

జీఐపీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీ: మే 14

తరగతులు ప్రారంభం: జూలై 1 నుంచి

మాస్టర్‌ ఆఫ్‌ సైబర్‌ లా అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ (ఎంసీఎల్‌ఐఎస్‌)

ఈ ప్రోగ్రామ్‌ని సంస్థ ఆధ్వర్యంలోని రాజీవ్‌గాంధీ నేషనల్‌ సైబర్‌ లా సెంటర్‌ నిర్వహిస్తుంది. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. గరిష్ఠంగా నాలుగేళ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఏడాదికి రెండు చొప్పున నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. మొదటి సెమిస్టర్‌లో రిసెర్చ్‌ మెథడాలజీ, సైబర్‌ ఎన్విరాన్‌మెంట్‌, సైబర్‌ లా, క్రిప్టోగ్రఫీ-నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, ప్రైవసీ అండ్‌ యాక్సెస్‌ మేనేజ్‌మెంట్‌; రెండో సెమిస్టర్‌లో సైబర్‌ క్రైమ్స్‌, ఈ కామర్స్‌ సెక్యూరిటీ అండ్‌ లా,

సైబర్‌ ఆపరేషన్స్‌ సెక్యూరిటీ, 4ఐఆర్‌-లా, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ-రిస్క్‌ మేనేజ్‌మెంట్‌; మూడో సెమిస్టర్‌లో ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ ఇన్‌ సైబర్‌ స్పేస్‌, మొబైల్‌ వైర్‌లెస్‌-సెక్యూరిటీ, బిజినెస్‌ ప్లానింగ్‌-ఆడిట్‌, సైబర్‌ ఫోరెన్సిక్స్‌ అండ్‌ లా, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సెక్యూరిటీ అండ్‌ లా కోర్సులు ఉంటాయి. చివరి సెమిస్టర్‌లో డిజర్టేషన్‌, ఇంటర్న్‌షిప్‌ ఉంటాయి. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ సౌకర్యం ఉంది.

సీట్లు: మొత్తం 66 సీట్లు ఉన్నాయి. వీటిలో జనరల్‌ అభ్యర్థులకు 30, ఎస్టీలకు 12, ఎస్సీలకు 10, ఓబీసీలకు 8, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 6 సీట్లు కేటాయించారు. అన్ని కేటగిరీల్లో 50 శాతం సీట్లను స్థానికులకు(మధ్యప్రదేశ్‌ వాసులు) ప్రత్యేకించారు. విదేశీ విద్యార్థుల కోసం అదనంగా అయిదు సీట్లు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.

ఎంట్రెన్స్‌ టెస్ట్‌: ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లీష్‌ (బేసిక్స్‌), కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అంశాలనుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు అడుగుతారు. ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో మరో 25 ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్షలో సాధించిన స్కోర్‌కు 75 శాతం, ఇంటర్వ్యూ స్కోర్‌కు 25 శాతం వెయిటేజీ ఇస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500

దరఖాస్తుకు చివరి తేదీ: మే 15

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీ: జూన్‌ 4

పర్సనల్‌ ఇంటర్వ్యూలు: జూన్‌ 4, 5

వెబ్‌సైట్‌: www.nliu.ac.in

Updated Date - 2023-04-17T12:54:01+05:30 IST