Jayashankar : రేపు జయశంకర్ స్మారక సదస్సు

ABN , First Publish Date - 2023-08-05T03:11:25+05:30 IST

ఆచార్య జయశంకర్ కొనసాగించిన విలువలను, ఉద్యమ స్ఫూర్తిని, సంఘటిత ఆలోచనలను, ప్రజాస్వామిక భావజాల వ్యాప్తిని మరింత ముందుకు తీసుకుపోయే క్రమంలో

Jayashankar : రేపు జయశంకర్ స్మారక సదస్సు

ఆచార్య జయశంకర్ కొనసాగించిన విలువలను, ఉద్యమ స్ఫూర్తిని, సంఘటిత ఆలోచనలను, ప్రజాస్వామిక భావజాల వ్యాప్తిని మరింత ముందుకు తీసుకుపోయే క్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ సెంటర్‌లో ఆచార్య జయశంకర్ 12వ స్మారక సదస్సు జరుగనున్నది. ఈ సదస్సునకు ముఖ్య అతిథిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి హాజరవుతారు. జయశంకర్ స్మారకోపన్యాసాన్ని ‘అసహన రాజకీయాలు–భారతదేశం’ అంశంపై జె.ఎన్.యు న్యూఢిల్లీకి చెందిన ప్రొఫెసర్‌ అజయ్ గుడవర్తి, సియాసత్ ఎడిటర్ జహీర్ అలీఖాన్ మొదటి సెషన్‌లో ప్రసంగిస్తారు. రెండవ సెషన్‌లో తెలంగాణ ఉద్యమకారులను సంఘటితం చేసుకోవడానికి ‘వర్తమాన తెలంగాణలో పౌర సమాజం బాధ్యత’ అనే అంశంపై హరగోపాల్, కె.శ్రీనివాస్, ఆకునూరి మురళి, పాశం యాదగిరి, మురళి మనోహర్, పద్మజా షా, వెంకట్ నారాయణలు ప్రసంగిస్తారు.

– అంబటి నాగయ్య

తెలంగాణ విద్యావంతుల వేదిక

Updated Date - 2023-08-05T03:11:25+05:30 IST