తన బస్‌లో ప్రయాణించే బాలికతో కలిసి ట్రైన్ కింద పడిన డ్రైవర్.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2023-02-03T19:24:03+05:30 IST

అతడు బస్ డ్రైవర్.. ఆ బాలిక అతడు నడిపే బస్‌లో రోజూ కాలేజీకి వెళ్లి వచ్చే విద్యార్థిని.. ఇద్దరూ కలిసి గురువారం రాత్రి 2 గంటల సమయంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి చనిపోయారు.. శుక్రవారం ఉదయం ట్రాక్‌పై ఇద్దరి మృతదేహాలు చెల్లాచెదురుగా కనిపించాయి..

తన బస్‌లో ప్రయాణించే బాలికతో కలిసి ట్రైన్ కింద పడిన డ్రైవర్.. కారణమేంటంటే..

అతడు బస్ డ్రైవర్.. ఆ బాలిక అతడు నడిపే బస్‌లో రోజూ కాలేజీకి వెళ్లి వచ్చే విద్యార్థిని.. ఇద్దరూ కలిసి గురువారం రాత్రి 2 గంటల సమయంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి చనిపోయారు.. శుక్రవారం ఉదయం ట్రాక్‌పై ఇద్దరి మృతదేహాలు చెల్లాచెదురుగా కనిపించాయి.. పక్క పక్క గ్రామాలకు చెందిన ఈ ఇద్దరూ ప్రేమ వ్యవహారం వల్లే ఆత్మహత్యలు చేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు (Crime News).

రాజస్థాన్‌లోని (Rajasthan) ఆళ్వార్‌కు సమీపంలోని సనేతాన్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్మీడియెట్ చదువుతుండేది. ఆమె రోజూ తన గ్రామం నుంచి కాలేజీ బస్ ఎక్కి వెళ్లి వస్తుండేది. ఆ బస్‌ను కమల్ దీప్ శర్మ అనే 20 ఏళ్ల యువకుడు నడుపుతుండేవాడు. పక్క పక్క గ్రామాలకు చెందిన ఆ ఇద్దరూ ప్రేమలో పడినట్టు తెలుస్తోంది (Love Affair). కులాంతరం, ఆర్థిక అంతరాల కారణంగా తమ పెళ్లి జరగదని భావించి ఆత్మహత్యలకు (Suicides) సిద్ధపడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి రెండు గంటలకు ఇద్దరూ కలిసి రైలు కింద పడి చనిపోయారు (Lovers jumped in front of the train).

Viral Video: ట్రైన్‌లో యువతి రౌడీయిజం.. యువకుడిని ఎలా బెదిరిస్తోందో చూశారా?.. వీడియో వైరల్!

గురువారం రాత్రి రాత్రి 3 గంటల సమయంలో పోలీసులకు ఈ ఆత్మహత్యల గురించి సమాచారం అందింది. ఢిగవాడ స్టేషన్ సమీపంలో ఇరువురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరి శరీరాలు బాగా ముక్కలైపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

Updated Date - 2023-02-03T19:24:04+05:30 IST