భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ముగ్గురు యువకులపై ఫిర్యాదు చేసిన మహిళ.. భర్త ఎదురుగానే ఆమె చెప్పింది విని పోలీసులు షాక్!

ABN , First Publish Date - 2023-02-19T19:06:58+05:30 IST

ఆ మహిళ వివాహిత.. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఆమె భర్తతో కలిసి నివసిస్తోంది.. ఆమె భర్త ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తుంటాడు.. ఆ మహిళపై అదే కాలనీకి చెందిన ముగ్గురు యువకులు కన్నేశారు..

భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ముగ్గురు యువకులపై ఫిర్యాదు చేసిన మహిళ.. భర్త ఎదురుగానే ఆమె చెప్పింది విని పోలీసులు షాక్!

ఆ మహిళ వివాహిత.. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఆమె భర్తతో కలిసి నివసిస్తోంది.. ఆమె భర్త ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తుంటాడు.. ఆ మహిళపై అదే కాలనీకి చెందిన ముగ్గురు యువకులు కన్నేశారు.. భర్త లేని సమయంలో పట్టపగలు ఆమె ఇంటిలోకి బలవంతంగా ప్రవేశించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చిన భర్త ఇంట్లో నీరసంగా పడి ఉన్న భార్యను చూసి షాకయ్యాడు.. ఆమె చెప్పింది విని వెంటనే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. (Rajasthan)

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని (Jaipur) ఓ కాలనీలో 26 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి నివసిస్తోంది. ఆ మహిళపై అదే కాలనీకి చెందిన రోహితాష్, సంజయ్, పింటూ అనే యువకులు కన్నేశారు. ఈ నెల 17వ తేదీన భర్త లేని సమయంలో ఆ ముగ్గురూ ఆమె ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. ఇంటి తలుపు వేసేసి ఒకరి తర్వాత ఒకరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు (Sexual Harassment). విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు (Crime News).

ఇప్పటికే పదిమంది పిల్లలు.. అయినా సరిపోలేదేమో.. భార్య పిల్లలను వద్దనుకుందని ఆ భర్త ఎంత పని చేశాడంటే..

సాయంత్రం డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన భర్త నీరసంగా ఉన్న భర్తను చూసి షాకయ్యాడు. ఏం జరిగిందని ఆరా తీశాడు. తనపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి ఆమె తన భర్తకు చెప్పింది. తర్వాతి రోజు ఉదయం అతడు తన భార్యను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి బాధితురాలిని హాస్పిటల్‌కు తరలించి దుండగులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

Updated Date - 2023-02-19T19:07:00+05:30 IST