తనకు దక్కనిది వేరేవరికీ దక్కకూడదంటూ భార్యను హెచ్చరించిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-02-26T16:16:57+05:30 IST

రాజస్థాన్‌లోని (Rajasthan) భిల్వారాలో ఓ భర్త ప్రవర్తన చాలా మందికి షాకిచ్చింది. తనకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదని భార్యను హెచ్చరించి దారుణానికి పాల్పడ్డాడు..

తనకు దక్కనిది వేరేవరికీ దక్కకూడదంటూ భార్యను హెచ్చరించిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..

రాజస్థాన్‌లోని (Rajasthan) భిల్వారాలో ఓ భర్త ప్రవర్తన చాలా మందికి షాకిచ్చింది.. ఓ వివాహ వేడుకకు తుపాకీతో వచ్చిన ఓ వ్యక్తి తన భార్యపై కాల్పులు జరిపాడు.. తనకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదని చెప్పి తుపాకీ పేల్చాడు.. ఆ ఘటనలో ఆ మహిళ గాయపడింది.. పక్కన ఉన్న వారు ఆ వ్యక్తి చేతులు కట్టేసి వెంటనే పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు (Crime News).

భిల్వారాకు సమీపంలోని భోజ్రాస్ గ్రామానికి చెందిన ప్రీతి దేవి అనే మహిళ శనివారం ఉదయం తన బంధువుల వివాహ కార్యక్రమానికి వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో అక్కడికి ఆమె భర్త సూరజ్ వచ్చాడు. అందరూ చూస్తుండగానే తుపాకీ బయటకు తీసి ప్రీతికి గురిపెట్టాడు. నాకు దక్కనిది ఇంకెవరకీ దక్కకూడదంటూ తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు (husband fired at his wife). ఒక్క బుల్లెట్ ప్రీతి చేయి గుండా దూసుకుపోయింది. వెంటనే అక్కడున్న వారు సూరజ్‌ను పట్టుకుని తుపాకీ (Gun firing) లాక్కున్నారు. పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కొంతకాలంగా ప్రీతి, సూరజ్ విడివిడిగా ఉంటున్నారు. భర్త ప్రవర్తన కారణంగా అతడితో ఉండేందుకు ప్రీతి ఇష్టపడడం లేదు. భర్త నుంచి విడాకులు (Divorce) కావాలని కోర్టను ఆశ్రయించింది. దీంతో భార్యను చంపెయ్యాలని సూరజ్ నిర్ణయించుకున్నాడు. బుల్లెట్ తగలడంతో ప్రీతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందుకుంటోంది.

Updated Date - 2023-02-26T19:01:12+05:30 IST