ప్రేమ ఎంత పని చేసింది.. ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్న యువతి పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2023-02-13T19:50:27+05:30 IST

ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆ యువతి భారీ మూల్యం చెల్లించింది.. ప్రియుడి కోసం కన్నవాళ్లను వదిలేసి వచ్చినందుకు ఎన్నో కష్టాలు పడింది.. ఏడాది తిరిగేసరికి అసలు విషయం తెలుసుకుంది..

ప్రేమ ఎంత పని చేసింది.. ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్న యువతి పరిస్థితి ఏంటంటే..

ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆ యువతి భారీ మూల్యం చెల్లించింది.. ప్రియుడి కోసం కన్నవాళ్లను వదిలేసి వచ్చినందుకు ఎన్నో కష్టాలు పడింది.. ఏడాది తిరిగేసరికి అసలు విషయం తెలుసుకుంది (Love Marriage).. మూడు నెలల గర్భంతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.. ప్రేమించి తన కోసం అన్ని వదులుకుని వచ్చేసిన భార్యను భర్త విషం పెట్టి చంపేశాడు.. నిందితుడి కోసం పోలీసులు అన్వేషణ సాగిస్తున్నారు (Crime News).

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మీరట్‌కు చెందిన 28 ఏళ్ల నీతూ అనే మహిళ ఆదివారం ఉదయం తన ఇంట్లో విగత జీవిగా పడి ఉంది. పక్కింటి మహిళ కిటీకీలో నుంచి చూసి పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ఆమె భర్త జితేంద్ర ఎక్కడా కనిపించలేదు. అతడి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయింది. పోస్ట్‌మార్టమ్‌లో ఆ మహిళ విషాహారం తినడం వల్ల చనిపోయినట్టు తేలింది. భర్తే ఆమెకు విషం పెట్టి చంపేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు (Husband Killed Wife).

ఉరేసుకుని చనిపోయిన 16 ఏళ్ల బాలిక.. మొబైల్‌లో భర్త పేరుతో నెంబర్.. పెళ్లి ఎప్పుడైందని ఆరా తీస్తే..

15 రోజుల క్రితమే జితేంద్ర, నీతూ తమ ఇంట్లోకి అద్దెకు దిగారని ఇంటి యజమాని తెలిపాడు. కాగా, నీతూ తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకున్నారు. తమ కూతురు ఏడాది క్రితం ఇంట్లో నుంచి వచ్చేసి ప్రేమ వివాహం చేసుకుందని, ఆమె ప్రస్తుతం మూడు నెలల గర్భవతి అని పోలీసులకు చెప్పారు. అల్లుడే తమ కూతురిని చంపేసి ఉంటాడని నీతూ తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. జితేంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2023-02-13T19:50:30+05:30 IST