HayathNagar Murder Case : టీచర్ సుజాత-రాజేష్ ఎపిసోడ్‌లో వెలుగులోకి షాకింగ్ విషయాలు.. అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా..!

ABN , First Publish Date - 2023-05-30T20:48:30+05:30 IST

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హయత్‌నగర్‌ టీచర్ సుజాత-రాజేష్ (Teacher Sujatha-Rajesh) ఎపిసోడ్‌లో రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోది. ఇప్పటికే అటు సుజాత ఆత్మహత్య, రాజేష్ హత్య గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూడగా..

HayathNagar Murder Case : టీచర్ సుజాత-రాజేష్ ఎపిసోడ్‌లో వెలుగులోకి షాకింగ్ విషయాలు.. అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా..!

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హయత్‌నగర్‌ టీచర్ సుజాత-రాజేష్ (Teacher Sujatha-Rajesh) ఎపిసోడ్‌లో రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోది. ఇప్పటికే అటు సుజాత ఆత్మహత్య, రాజేష్ హత్య గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూడగా.. తాజాగా కొన్ని ట్విస్ట్‌లు బయటికొచ్చాయి. రాజేష్ హత్యకు మూడ్రోజుల ముందే దాడి జరిగిందని పోలీసులు నిగ్గు తేల్చారు. రాజేష్‌పై హయత్‌నగర్‌లో (Hayath Nagar) ఓ ఇంటి దగ్గర ముగ్గురు దాడికి తెగబడ్డారు. టీచర్ సుజాత ఇంటికి సమీపంలోనే రాజేష్ హత్య జరగడం గమనార్హం. అయితే.. ఈ ఇద్దరి పరిచయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. టీచర్ కుటుంబసభ్యుల పాత్రపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. హయత్‌నగర్‌లోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేష్‌ను అతి కిరాతకంగా దుండగులు చంపారు. నాలుగు రోజుల కిందట నగ్నంగా మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడ లభ్యమైన వస్తువుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి రాజేష్‌గా గుర్తించారు. రాజేష్‌ను సుజాత భర్త, ఆమె కొడుకు కలిసి తీవ్రంగా కొట్టినట్లు మొదట రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత మంగళవారం రోజు ఉదయం నుంచి ఒక్కొ ట్విస్ట్ వెలుగుచూసింది.

Sujatha-and-Rajesh.jpg

ఆసక్తికర పరిణామం..!

రాజేష్-టీచర్ సుజాతల మధ్య పరిచయంపై ఆసక్తికర పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. 7 నెలల క్రితం సుజాత ఫోన్ నుంచి రాజేష్‌కు రాంగ్ డయల్‌గా (Wrong Dial) కాల్ వెళ్లింది. ఇలా రాంగ్ డయల్‌తో ఇద్దరికి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య తరుచూ వాట్సాప్‌ మెసేజ్‌లు నడిచాయని పోలీసులు తేల్చారు. సుజాత డీపీ చూసిన రాజేష్.. ఆమెకు పెళ్లి కాలేదనే నమ్మి ప్రేమలో పడ్డాడు. పెళ్లి కూడా చేసుకోవాలని రాజేష్ నిర్ణయించాడు. కొన్నాళ్ల తర్వాత సుజాతకు పెళ్లైనట్లు.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు రాజేష్ తెలుసుకున్నాడు. తనను మోసం చేసిందని సుజాతతో రాజేష్ గొడవపడ్డాడు. అప్పట్నుంచీ సుజాతను రాజేష్ దూరంగా పెట్టాడు. ‘ఒకసారి కలుద్దాం’ అని రాజేష్‌కు మెసేజ్ పెట్టింది సుజాత. అయితే.. యువకుడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చనిపోతానని ఆమె బెదిరింపులకు పాల్పడింది. ‘నువ్వు చనిపోతే నేను కూడా చనిపోతాను’ అంటూ రాజేష్ రిప్లయ్ ఇచ్చాడు. దీంతో సుజాతను కలుద్దామని హయత్‌నగర్‌కు రాజేష్ వెళ్లాడు. అప్పటికే సుజాత ఆత్మహత్యాయత్నం చేసింది. రాజేష్, సుజాత వ్యవహారం కూతురు, కొడుకు తెలుసుకున్నారు. రాజేష్‌పై ముగ్గురితో కలిసి సుజాత కొడుకు దాడి చేశాడు. సుజాత చనిపోతుందన్న భయంతో రాజేష్ మందు తాగాడు. సుజాత ఇంటి సమీపంలోనే శవంగా రాజేష్ కనిపించాడని పోలీసులు తేల్చారు.

Rajesh-and-Sujatha.jpg

సుజాత భర్త ఇలా..!?

తన భార్యకు, రాజేష్‌కు ఉన్న సంబంధంపై విచారణ జరపాలని పోలీసులను సుజాత భర్త నాగేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. తన భార్య అమాయకురాలని ఆయన చెబుతున్నారు. అయితే సుజాతకు విషం ఇచ్చి చంపి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నా భార్య చాలా మంచిది. నా భార్యను ఎవరో బ్లాక్ మెయిల్ చేశారు. చాలా గట్టిగా ఆమెను భయపెట్టారు. మార్ఫింగ్ చేసి బెదిరించడమో, లేక మమ్మల్ని చంపుతామని బెదిరించడమో చేశారు. ఆ విషయాన్ని మాకు చెప్పలేక భయపడి ఇలా చేసుకుందని అనుకుంటున్నాం. రాజేష్‌ ఎవరో మాకు తెలియదు.. రాజేష్‌ను ఎప్పుడూ చూడలేదు. నా భార్య మృతికి కారణం పై పూర్తి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరుతున్నా. సెల్‌ఫోన్ ఉపయోగించినప్పటి నుంచి విచారణ చేయాలి. నా భార్యకు, రాజేష్‌కు వయస్సులో చాలా వ్యత్యాసం ఉంది. సోషల్ మీడియా ద్వారా రాజేష్‌ పరిచయం అయి ఉండవచ్చని అనుకుంటున్నాం. రాజేష్‌పై దాడి చేశారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. రాజేష్‌ను నేను కాని, నా కొడుకు కాని ఎవరూ కొట్టలేదు’ అని నాగేశ్వరరావు మీడియాకు వివరించారు.

Rajesh-Dead-Body.jpg

అంతకుముందు అసలేం జరిగింది..!?

ములుగు జిల్లా పంచాక్తులపల్లికి చెందిన రాజేష్ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసి స్నేహితులతో కలిసి హాస్టల్‌లో ఉంటున్నాడు. చివరిసారిగా మే- 22న చైతన్యపురిలోని తన స్నేహితుడు సాయి ప్రకాష్ ఉంటున్న హాస్టల్ నుంచి ఓ పెళ్లికి వెళ్తున్నా అని చెప్పి బయటకు వచ్చిన రాజేష్.. 24 నుంచి ఫోన్‌కాల్స్‌ను లిఫ్ట్‌ చేయలేదు. చివరకు హయత్‌నగర్ కుంట్లూరులో శవమై కనిపించాడు. కుళ్లిపోయిన స్థితిలో రాజేష్‌ మృతదేహం లభ్యమైంది. మృతదేహం‌పై పలుచోట్ల గాయాలు, పక్కనే కండోమ్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే రాజేష్‌కు హయత్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ టీచర్ సుజాతతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం సుజాత భర్త నాగేశ్వర రావు‌కు తెలియడంతో.. ఇద్దరి మధ్య గొడవ జరిగిందని.. మనస్తాపంతో ఈనెల 24న రాత్రి సుజాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబసభ్యులు సుజాతను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సుజాత మృతి చెందింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగుచూశాయి.

Rajesh-things.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Delhi Liquor Scam Case : ప్చ్.. మొన్న పేరే లేదు.. ఇప్పుడు సడన్‌గా ఎమ్మెల్సీ కవిత విషయంలో బాంబ్ పేల్చిన ఈడీ..

******************************

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత సేఫ్.. ఎక్కడా కనిపించని పేరు.. క్లీన్ చిట్ వచ్చేసినట్లేనా..!?

*****************************

Modi Vs Kcr : కర్ణాటక ఫలితాలు, గవర్నర్ వ్యవస్థను ప్రస్తావించి మరీ కేంద్రంపై కేసీఆర్ ఫైర్..

******************************

BJP and BRS : కారు-కమలం నిజంగానే కలిసిపోతాయా.. ఇన్ని అస్త్రాలున్నా కేసీఆర్ నోరు మెదపకపోవడం వెనుక ఇంత కథుందా.. సడన్‌గా ఎందుకో ఇలా..!?

******************************

Updated Date - 2023-06-01T16:23:54+05:30 IST