Former CM: సంచలనం: మాజీ సీఎంపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు

ABN , First Publish Date - 2023-05-27T08:37:09+05:30 IST

మాజీ ముఖ్యమంత్రిపై పోలీసులు మొత్తం మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం స్థానికంగా సంచలనం కలిగించింది.

Former CM: సంచలనం: మాజీ సీఎంపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు

పెరంబూర్‌(చెన్నై): ఎన్నికల నామినేషన్‌ ప్రతంలో ఆస్తి వివరాలు గోప్యంగా ఉంచారని ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami)పై కేంద్ర క్రైం విభాగం పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ నివేదిక శుక్రవారం కోర్టులో దాఖలు చేశారు. 2021 శాసనసభ ఎన్నికల్లో ఎడప్పాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే(AIADMK) అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తన ఆస్తుల వివరాలు సక్రమంగా చూపించ లేదని కోర్టులో కేసు నమోదైంది. కేసు విచారించిన న్యాయమూర్తి, తగిన ఆధారాలుంటే సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు సేలం న్యాయమూర్తి ఉత్వర్వులు జారీ చేశారు. అలాగే, విచారణ నివేదిక ఈ నెల 26వ తేదిలోపు దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ ప్రకారం, సేలం కేంద్ర క్రైం విభాగం పోలీసులు ఈపీఎస్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో, తాము చేపట్టిన విచారణ నివేదికను క్రైం విభాగం పోలీసులు శుక్రవారం న్యాయస్థానంలో దాఖలు చేశారు.

Updated Date - 2023-05-27T08:44:06+05:30 IST