Courier: చివరకు ఇలా చేస్తున్నారన్నమాట.. కొరియర్‌ ద్వారా మత్తు మాత్రల దిగుమతి

ABN , First Publish Date - 2023-06-04T10:00:01+05:30 IST

కొరియర్‌(Courier) ద్వారా మత్తుమాత్రలు దిగుమతి చేసుకొని విక్రయిస్తున్న వ్యవహారంలో దంపతులు సహా నలుగురిని అరెస్టు చేశారు. స్థానిక కొడుంగై

Courier: చివరకు ఇలా చేస్తున్నారన్నమాట.. కొరియర్‌ ద్వారా మత్తు మాత్రల దిగుమతి

- దంపతులు సహా నలుగురి అరెస్టు

పెరంబూర్‌(చెన్నై): కొరియర్‌(Courier) ద్వారా మత్తుమాత్రలు దిగుమతి చేసుకొని విక్రయిస్తున్న వ్యవహారంలో దంపతులు సహా నలుగురిని అరెస్టు చేశారు. స్థానిక కొడుంగైయూర్‌లో నొప్పుల నివారణకు వినియోగించే మత్తుమాత్రల విక్రయాలు జరుగుతున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ శరవణన్‌కు సమాచారం అందింది. ఈ వ్యవహారంపై పోలీసులు చేపట్టిన విచారణలో, కొడుంగైయూర్‌ ఎళిల్‌నగర్‌లోని ఓ చిరునామాకు తరచూ గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌ నుంచి కొరియర్‌లో పార్శిళ్లు వస్తున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలో, శుక్రవారం ఆ చిరునామాకు కొరియర్‌ వచ్చిందని సిబ్బంది ద్వారా తెలుసుకున్న పోలీసులు, ఆ చిరునామాలో కొరియర్‌ అందించాలని కోరారు. కొరియర్‌ సిబ్బంది సమా చారం అందించగా చంద్రశేఖర్‌నగర్‌ మూడో వీధికి వచ్చి తీసుకుంటామని తెలపడంతో, అక్కడ కాపు వేసిన పోలీసులు అక్కడికి వచ్చిన రంజిత్‌కుమార్‌, ఆయన భార్య దివ్యను అదుపులోకి తీసుకున్నారు. వారి సమాచారం మేరకు ఈ వ్యవహారంలో సంబంధాలున్న ఎళిల్‌నగర్‌కు చెందిన అరుళ్‌, అరుణ్‌రాజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరు సూరత్‌ నుంచి నొప్పి నివారణ మాత్రలు కొరియర్‌ ద్వారా తెప్పించుకొని ఒక్కో మాత్రను రూ.250 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారని తేలింది. ఈ వ్యవహారంలో మరెవరికైనా సంబంధాలున్నాయా అని పోలీసులు విచారిస్తున్నారు.

Updated Date - 2023-06-04T10:00:01+05:30 IST