రెండు వివాహాలు దాచి.. మళ్లీ పెళ్లి.. రూ.60 లక్షల నగదు, నగలు తీసుకొని..

ABN , First Publish Date - 2023-09-15T07:53:34+05:30 IST

రెండు వివాహాల జరిగిన విషయం దాచి తనను వివాహం చేసుకోవడంతో పాటు రూ.60 లక్షల నగదు, నగలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు చేపట్టాలని

రెండు వివాహాలు దాచి.. మళ్లీ పెళ్లి.. రూ.60 లక్షల నగదు, నగలు తీసుకొని..

- వేలూరు డీఐజీకి తిరుపతి జిల్లా మహిళ ఫిర్యాదు

వేలూరు(చెన్నై): రెండు వివాహాల జరిగిన విషయం దాచి తనను వివాహం చేసుకోవడంతో పాటు రూ.60 లక్షల నగదు, నగలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా నాగలాపురానికి చెందిన రమ్య (38) వేలూరు డీఐజీకి ఫిర్యాదు చేశారు. రమ్యకు 2007లో చెన్నైకి చెందిన కుమారస్వామితో వివాహం కాగా, వారికి ఓ కుమార్తె ఉంది. అయితే 2020లో కుమారస్వామి అనారోగ్యంతో మృతిచెందడంతో తన కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించిన రమ్య తల్లిదండ్రులు.. ఓ వివాహ పరిచయ వెబ్‌సైట్‌లో ప్రకటన ఇచ్చారు. తిరుపత్తూర్‌ జిల్లాకు చెందిన వినోద్‌కుమార్‌ ఈ ప్రకటన చూసి, వారిని సంప్రదించాడు. తాను ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నట్లు నమ్మబలికిన వినోద్‌కుమార్‌.. వేలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం(Vellore Sub Registrar Office)లో రమ్యను వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆ దంపతులు అరియూర్‌ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. వివాహ సమయంలో రమ్య తల్లిదండ్రులు 50 సవర్ల నగలు, 4 కిలోల వెండి వస్తువులు ఇచ్చారు. వాటిని స్వాహా చేసిన వినోద్‌కుమార్‌.. అనంతరం రమ్యకు చెందిన కారు, ద్విచక్రవాహనం, స్థలాన్ని తన పేర రాయించుకుని మోసం చేశాడు. అతడి గురించి ఆరా తీయగా, ఇప్పటికే రెండు వివాహాలు చేసుకుని, మోసం చేసినట్లు తెలిసింది. దీంతో రమ్య వేలూరు డీఐజీని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన డీఐజీ ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసినట్లు రమ్య మీడియాకు తెలిపారు.

Updated Date - 2023-09-15T07:53:34+05:30 IST