ఇంటికి పిలిచి తాళి కట్టాడు.. పెళ్లి అయినట్టే అని ఆ మైనర్లు ఇద్దరూ ఏం చేశారంటే.. చివరకు..

ABN , First Publish Date - 2023-02-03T21:05:29+05:30 IST

ఆ బాలిక పదో తరగతి చదువుతోంది.. ఇంటికి దగ్గర్లోనే ఉండే బాలుడితో స్నేహం చేసింది.. ఫోన్ ద్వారా అతడితో గంటలు గంటలు మాట్లాడేది.. తర్వాత ఒకరోజు ఆ బాలుడి ఇంటికి వెళ్లింది.. అక్కడ బాలిక నుదుటిన సింధూరం దిద్దిన బాలుడు, మెడలో పసుపు తాడు కట్టాడు.. అనంతరం..

ఇంటికి పిలిచి తాళి కట్టాడు.. పెళ్లి అయినట్టే అని ఆ మైనర్లు ఇద్దరూ ఏం చేశారంటే.. చివరకు..

ఆ బాలిక పదో తరగతి చదువుతోంది.. ఇంటికి దగ్గర్లోనే ఉండే బాలుడితో స్నేహం చేసింది.. ఫోన్ ద్వారా అతడితో గంటలు గంటలు మాట్లాడేది.. తర్వాత ఒకరోజు ఆ బాలుడి ఇంటికి వెళ్లింది.. అక్కడ బాలిక నుదుటిన సింధూరం దిద్దిన బాలుడు, మెడలో పసుపు తాడు కట్టాడు.. అనంతరం నువ్వు నా భార్యవు అని చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. చాలా రోజుల తర్వాత ఆ బాలిక తన అమ్మమ్మకు విషయం చెప్పింది.. ఆమె ద్వారా విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు (Crime News).

మధ్యప్రదేశ్‌లోని (Madhya pradesh)ఇండోర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక (Minor Girl) పదో తరగతి చదువుతోంది. ఆమెకు తన ఇంటికి దగ్గర్లోనే ఉండే 17 ఏళ్ల బాలుడితో స్నేహం కుదిరింది. ఇద్దరూ ఫోన్ ద్వారా గంటలు గంటలు మాట్లాడుకునే వారు. గతేడాది ఫిబ్రవరిలో ఆ బాలుడి ఆహ్వానం మేరకు బాలిక అతడింటికి వెళ్లింది. అక్కడ ఆ బాలుడు ఆమె మెడలో పసుపు తాడు కట్టి, నుదిటిన బొట్టు పెట్టాడు. పెళ్లి అయిపోయినట్టే అని చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు (Sexual Harassment). విషయం ఎవరికీ చెప్పవద్దని చెప్పి వీలైనప్పుడల్లా ఆ బాలికపై అత్యాచారం చేసేవాడు.

తనకు పెళ్లి అయిపోయిందని ఆ బాలిక ఇటీవల తన అమ్మమ్మకు చెప్పింది. షాకైన అమ్మమ్మ ఆ బాలిక నుంచి అన్ని విషయాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు చెప్పింది. బాలికి తండ్రి వెంటనే నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కూడా మైనర్ కావడంతో అతడిని జువైనల్ హోమ్‌కు తరలించారు.

Updated Date - 2023-02-03T21:05:31+05:30 IST