ఇదో విషాధ సంఘటన.. మహిళ చీరకు కర్పూరం నిప్పంటుకొని..

ABN , First Publish Date - 2023-06-01T13:26:52+05:30 IST

పూజ చేస్తున్న మహిళ కర్పూరం వెలిగిస్తుండగా పొరపాటున చీరకు నిప్పంటుకొని మృతి చెందింది. తిరువళ్లూర్‌(Tiruvallur) జిల్లా ఆరణి బజారు

ఇదో విషాధ సంఘటన.. మహిళ చీరకు కర్పూరం నిప్పంటుకొని..

గుమ్మిడిపూండి(చెన్నై): పూజ చేస్తున్న మహిళ కర్పూరం వెలిగిస్తుండగా పొరపాటున చీరకు నిప్పంటుకొని మృతి చెందింది. తిరువళ్లూర్‌(Tiruvallur) జిల్లా ఆరణి బజారు వీధికి చెందిన వరలక్ష్మి (58) పట్టణంలోని భవానీ అమ్మన్‌ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించింది. పూజల్లో కర్పూరం వెలిగించిన సమయంలో హఠాత్తుగా చీరకు నిప్పంటుకుంది. గమనించిన చట్టుపక్కల వారు మంటలను ఆర్పి తిరువళ్లూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్సల అనంతరం ఆమెను చెన్నై కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ బుధవారం ఉదయం మృతి చెందింది. ఈ ఘటనపై ఆరణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-06-01T13:31:00+05:30 IST