AP News: కోళ్లను చంపేశారని పీఎస్కు మహిళ.. కోళ్లకు పోస్టుమార్టం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-11-29T13:38:23+05:30 IST
నాటు కోళ్ల మృతి వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరింది. పూతలపట్టు మండలం బత్తుల వారి పల్లి గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. బత్తులవారిపల్లికి చెందిన సుభాషిని అనే మహిళకు చెందిన ఐదు నాటు కోళ్లు తాజాగా మృతి చెందాయట.
![AP News: కోళ్లను చంపేశారని పీఎస్కు మహిళ.. కోళ్లకు పోస్టుమార్టం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..](https://media.andhrajyothy.com/media/2023/20231102/hens_bb1d627aa2.jpg)
చిత్తూరు : నాటు కోళ్ల మృతి వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరింది. పూతలపట్టు మండలం బత్తుల వారి పల్లి గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. బత్తులవారిపల్లికి చెందిన సుభాషిని అనే మహిళకు చెందిన ఐదు నాటు కోళ్లు తాజాగా మృతి చెందాయట. ఎవరో తన నాటు కోళ్లకు మందు పెట్టి చంపేశారని భావించిన సుభాషిని పూతలపట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పశు వైద్యాధికారితో తమ సమక్షంలోనే పోలీసులు కోళ్లకు పోస్టుమార్టం నిర్వహించారు. ఉద్దేశపూర్వకంగానే వాళ్ల పూల మొక్కలకి పక్కింటి వారు యూరియా చల్లారని.. అది తిని తన నాటు కోళ్లు మృతి చెందాయని సుభాషిణి ఫిర్యాదులో పేర్కొంది.