6న మాధవాయిపాలెం రేవు వేలం పాట
ABN , First Publish Date - 2023-03-26T00:46:20+05:30 IST
మాధవాయిపాలెం– సఖినేటి పల్లి రేవు పాటను తిరిగి వచ్చే నెల 6న నిర్వహించనున్న ట్టు ఎంపీడీవో ప్రసాద్ యాదవ్ తెలిపారు.
నరసాపురం, మార్చి 25: మాధవాయిపాలెం– సఖినేటి పల్లి రేవు పాటను తిరిగి వచ్చే నెల 6న నిర్వహించనున్న ట్టు ఎంపీడీవో ప్రసాద్ యాదవ్ తెలిపారు. రేవు పాటను తొలుత శుక్రవారం నిర్వహించగా ఒక్కటే టెండర్ దాఖలు కావడంతో రద్దు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యం లో మరల శనివారం నోటిఫికేషన్ను జారీ చేశారు. పాట ప్రారంభ ధర రూ.2.17 కోట్లుగా నిర్ణయించారు. సోమ వారం నుంచి ఏప్రిల్ 1 వరకు టెండర్ ఫారాలు విక్రయి స్తారు. 6వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ, సీక్రెట్ పద్ధతిలో వేలం పాట నిర్వహించనున్నారు. ఈ రెండింటిలో హెచ్చు మొత్తంలో పాడిన పాటదారుడికి 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రేవు నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తారు.