Share News

పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు

ABN , First Publish Date - 2023-11-21T00:07:13+05:30 IST

విజయవాడ డివిజన్‌లోని రైల్వే ట్రాక్‌ మరమ్మతుల కారణంగా 22 రైళ్లను రద్దు చేశారు.

పలు రైళ్లు రద్దు..  కొన్ని దారి మళ్లింపు

ఏలూరు క్రైం, నవంబరు 20 : విజయవాడ డివిజన్‌లోని రైల్వే ట్రాక్‌ మరమ్మతుల కారణంగా 22 రైళ్లను రద్దు చేశారు. మరో 8 రైళ్లను విజయ వాడ – రామవరప్పాడు మధ్యలో రద్దు చేయగా, కొన్ని రైళ్లను ఏలూరు– తాడేపల్లిగూడెం మీదుగా వెళ్లనీయకుండా రద్దు చేసి నిడదవోలు జంక్షన్‌, భీమవరం టౌన్‌ గుడివాడ మీదుగా విజయవాడ వెళ్లేలా దారి మళ్లించారు.

రద్దు అయిన రైళ్లు

17243 గుంటూరు–రాయగడ 20 నుంచి 26 వరకు

17244 రాయగడ–గుంటూరు 21 నుంచి 27 వరకు

22702 విజయవాడ–విశాఖ 20, 21, 22, 24 25 తేదీల్లో

22701 విశాఖ–విజయవాడ 20, 21, 22, 24, 25 తేదీల్లో

17239 గుంటూరు–విశాఖ 20 నుంచి 26 వరకు

17240 విశాఖ–గుంటూరు 21 నుంచి 27 వరకు

దారి మళ్ళించిన రైళ్లు

విజయవాడ–ఏలూరు–తాడేపల్లిగూడెం–నిడదవోలు మీదుగా వెళ్లే రైళ్లను విజయవాడ–గుడివాడ–భీమవరం–తణుకు–నిడదవోలు మీదుగా మళ్లించారు.

12756 భావనగర్‌– కాకినాడ పోర్టు 25న

12509 బెంగళూరు – గౌహతి 22, 25 తేదీల్లోను

11019 ఛత్రపతి టెర్మినల్‌ – భువనేశ్వర్‌ 20, 22, 24 తేదీల్లోను

13351 ధన్‌బాగ్‌–అల్లాఫస్‌ 20 నుంచి 26 వరకు

18637 అట్టాయ్‌–బెంగళూరు 25 వరకు

12835 అట్టాయ్‌–బెంగళూరు 21, 26 తేదీల్లోను

12889 టాటా–బెంగళూరు 24న

18111 టాటా–యశ్వంత్‌పూర్‌ 23న

12376 జసిద్‌ – తాంబ్రం 22న

శబరిమలైకు ప్రత్యేక రైళ్లు

నరసాపురం, నవంబరు 20 : జిల్లా నుంచి శబరిమల అయ్యప్ప కొండకు వెళ్లే భక్తుల కోసం నవంబరు, డిసెంబర్‌, జన వరి నెలల్లో కొట్టాయంకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు భీమవరం రైల్వే ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ మఽధుబాబు, నరసాపురం ఎస్‌ఎం దివాకర్‌ చెప్పారు.

నరసాపురం నుంచి 07135 నెంబరుతో ఈ నెల 26, డిసెంబరు 10, 17, 24, 31, జనవరిలో 7, 14 తేదీల్లో మఽధ్యాహ్నం 3.50 గంటలకు బయ ల్దేరి మర్నాడు సాయంత్రం 4.50 గంటలకు కొట్టాయం చేరుతుంది.

తిరుగు ప్రయాణంలో కొట్టాయం నుంచి 07136 నెంబరుతో నవంబరు 27, డిసెంబరు 11, 18, 25, జనవరిలో 1, 8, 15 తేదీల్లో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి మర్నాడు రాత్రి తొమ్మిది గంటలకు నరసాపురం చేరుతుంది.

రేణిగుంట, చిత్తూరు, జాలర్‌పేట, తిరుపుర్‌, కోయంబత్తూర్‌, ఎర్నాకులం మీదుగా వెళ్లే ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్‌, జంక్షన్‌, ఆకివీడు, కైకలూరు స్టేషన్లలో ఆగుతుంది.

25 వరకు విశాఖ లింకు రద్దు

రాజమండ్రి – విశాఖ మధ్య ట్రాక్‌ పనులు కారణంగా మచిలీపట్నం – భీమవరం – విశాఖ మధ్య నడిచే లింకు ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 25 వరకు రద్దు చేశారు. విశాఖ నుంచి భీమవరం మీదుగా మచిలీపట్నం వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను 26 వరకు నిలిపివేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌కు నరసాపురం నుంచి రాత్రి 11 గంటలకు భీమవరం వరకు నడిచే డెమో ఎక్స్‌ప్రెస్‌ యథావిధిగా నడుస్తుంది.

Updated Date - 2023-11-21T00:07:15+05:30 IST